TSPSC question paper leak case-Telugudunia

TSPSC paper leak : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితుల భార్యలు కూడా TSPSC పరీక్షకు హాజరయ్యారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్- సిట్ పోలీసులు ఇటీవల కనుగొన్నారు. కమిషన్ నెట్‌వర్క్ విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, రాజేశ్వర్‌నాయక్‌ భార్య శాంతి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీపీవో) ప్రశ్నపత్రం సాయంతో పరీక్ష రాసినట్లు విచారణలో తేలింది.

కాగా, నిందితురాలు రేణుకా రాథోడ్‌కు పరిచయస్తుడైన రాహుల్ ఆమె వద్ద నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నపత్రాన్ని తీసుకున్నాడు. నాగార్జునసాగర్‌కు చెందిన రమావత్‌ దత్తు రేణుక భర్త ధాక్యానాయక్‌ నుంచి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. ఈ కేసులో నిందితులు, పరీక్ష రాసిన అభ్యర్థుల కాల్ డేటాను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి

నిందితుడి భార్య శాంతి, రాజేశ్వర్, రాజశేఖర్ రెడ్డి భార్య సుచిత్రలను కూడా సిట్ అరెస్టు చేసింది. శాంతి ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయగా, సుచిత్ర MSc కెమిస్ట్రీ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది.